కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.