మక్కేశ్వరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నవాబ్ పేట మండలానికి చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో గురువారం మధ్యాహ్నం చేరారు. ఈ సందర్భంగా వారికి ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసిఆర్ నాయకత్వంలో పాలనను కోరుకుంటున్నారని తెలిపారు.