మైదుకూరు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో కంచర్ల ఆంజనేయుల నివాసంలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. కట్టుబట్టలతో మిగిలిపోయిన బాధిత కుటుంబం జీవనోపాధిగా ల్యాండ్రీ నడుపుకుంటూ వస్తోంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.