Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్ పరిధిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Sep 12, 2025
హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీలో ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీవాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ పక్కనే ఉన్న స్మశాన వాటికలో వర్షం నీరు నిలువ కావడంతో ఆ నీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కొత్త డ్రైన్లు మంజూరయ్యాయని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us