సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో ఈనెల 23న డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ స్వామి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కి సంబంధించిన సమస్యలు, సలహాలు, సూచనలు 9959226269 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలన్నారు. ఈ అవకాశాన్ని డిపో పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.