శ్రీ సత్య జిల్లా పెనుగొండ సమీపాన శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆటోను ఢీకొన్న కారు ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మి ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సోమందపల్లి నుండి పెనుగొండకు ఆటోలో వెళుతుండగా పెనుగొండ ఊరి బయట ఈ ప్రమాదం జరిగినది. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.