అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలో పాడేరులో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న ధీరజ్ రానున్నారు. విద్యాసాగర్ నాయుడిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ అనేక సంచలనాత్మక హత్య కేసులతో పాటు దోపిడీ కేసులను ఛేదించి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు.