శనివారం సాయంత్రం గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక రోడ్ల మరమ్మతు పనులను చేపట్టాలన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు..