కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుల్బర్గా పట్టణానికి చెందిన డ్రైవర్ మృతి చెందాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తించి గట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.