భోరజ్ మండలంలోని తర్నం వాగు ఎగువన భారీ వర్షాల కారణంగా మంగళవారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తర్నం తాత్కాలిక బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ కారణంగా వాగు మధ్యలో మూడు లారీలు నిలిచిపోయాయి. ప్రయాణికులు లాండసాంగి గ్రామం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాగు ఉద్ధృతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.