తాపేశ్వరం లో టీటీడీ సహకారంతో శ్రీ వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో 73వ వార్షిక వేదసభ నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ వేదం ప్రాముఖ్యత, ప్రాచీనతను ప్రజలకు తెలియజేయడంతో పాటు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ఈ సభ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వేద శాఖలకు చెందిన పండితులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.