తిరుపతి జిల్లా నాయుడుపేటలో మద్యం మత్తులో కత్తితో దాడి చేశారు. వివరాల మేరకు నాయుడుపేట లోని గాంధీ పార్క్ వద్ద అవధాని నరసయ్య, సురేందర్ రెడ్డి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నరసయ్య తన వద్ద తీసుకున్న 160 రూపాయలు అడగగా కోపోద్రోప్తుడైన సురేంద్ర రెడ్డి కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసయ్యను స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ దాడి ఆదివారం రాత్రి జరగగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.