Download Now Banner

This browser does not support the video element.

కోడుమూరు: గూడూరులో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మెగా చెక్కులను అందించిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

Kodumur, Kurnool | Aug 2, 2025
గూడూరు పట్టణంలో శనివారం పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ మొదటి విడత పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో రైతన్నలకు ఇచ్చిన హామీలో భాగంగా మొదటి విడత కింద రూ 7 వేలు జమ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు పింఛన్ పెంచారని, దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు, ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులకు ఆయన మెగా చెక్కు అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us