Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఫైన్ లైన్ కమాన్ వద్ద బర్రె అడ్డు రావడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది వరంగల్ టు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు చోటుచేసుకుంది బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పెను ప్రమాదం తప్పిందని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాద పరిస్థితిని ఆరా తీస్తున్నారు