గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద గురువారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భోజన విరామ సమయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, సందర్శకులకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, డీఆర్డీఓ శేషాద్రి, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన అధికారి లత, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.