Download Now Banner

This browser does not support the video element.

ములుగు: జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపైకి వచ్చి చేరిన వరద నీరు, వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు #localissue

Mulug, Mulugu | Aug 12, 2025
ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163 పై వరద నీరు వచ్చి చేరడంతో నేడు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షం కారణంగా వరదనీరు రహదారిపై వచ్చి చేరింది. గతంలో ఆ ప్రాంతంలో వరద నీరు ప్రవహించడానికి కాలువ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరిగి అభివృద్ధి కావడంతో, కాలువ కనుమరుగై పోయింది. దీంతో వరద నీరు ప్రవహించడానికి కాలువ లేకుండా పోయింది. దీంతో ప్రతి సారి వర్షం పడినప్పుడల్లా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us