మచిలీపట్నంలో శనివారం రాత్రి జరిగిన దారుణంలో, ఫాతిమా మీర్జా అనే మహిళపై ఆమె సొంత కొడుకు కత్తితో దాడి చేశాడు. మద్యం సేవించి, తల్లితో గొడవపడిన యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాధితురాలికి నాలుగు వేళ్లు తెగిపోయాయి. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.