రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు నిర్లక్ష్యంగా ఓ బాలికకు మూడు ఇంజక్షన్ వేయడంతో ఆ బాలికకు ఇంజక్షన్ వేసిన చోట సెప్టిక్ కావడంతో సోమవారం వైద్య అధికారులు బాలిక కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. మంగళవారం ఇంజక్షన్ వికటించి బాలికకు సెప్టిక్ కావడానికి కారణమైన పీఎంపీ వైద్యుడు శీలం మీనయ్యకు సంబంధించిన క్లినిక్ ను మండల వైద్య, రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు.