ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమురం భీం అడ ప్రాజెక్టులోకి 7,778 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 3 గేట్లను 1.0 మీటర్ల మేర ఎత్తి 6,205 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా గురువారం ఉదయం నాటికి 237.35 మీటర్లకు చేరడంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.