తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో ఉన్న 9 వ బెటాలియన్ లో "ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్ సండేస్ ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్' కార్యక్రమాన్ని కమాండెంట్ ఈ ఎస్ సాయి ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం బెటాలియన్ నుంచి వాంపల్లి వరకు జరిగింది. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. సైక్లింగ్ తో ఆరోగ్యం బాగుండడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటాలన్నారు.