జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 28న సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదు ఆవుతుండటంతో విద్యార్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.