నల్లగొండ జిల్లా: మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం అన్నారు. ఈ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని రామ్ నగర్ పార్కులో జరిగిన కుక్కల దత్తత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హైదరాబాద్ తర్వాత నల్లగొండలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు జంతువుల పట్ల దయగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.