రాజోలి ఆనకట్ట నుంచి మైదుకూరు నియోజకవర్గంలోని కేసీ కెనాల్కు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు, నీటి సంఘాల నాయకులతో కలిసి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు జలహారతి పూజలు చేశారు. ఎగువ ప్రాంతాలలో పడిన వర్షాల వల్ల సకాలంలో డ్యాములు నిండాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.