మచిలీపట్నం లో జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగానే జిల్లాకు యూరియా వచ్చిందన్నారు. అయితే కొంత మంది రైతులు రబీలో యూరియా దొరకదేమో అన్న అపోహతో ఉన్నారని, ఫలితంగా యూరియాకు డిమాండ్ పెరిగిందన్నారు. అలాగే కొంత మంది నాన్ అగ్రికల్చర్ పర్పస్కి యూరియాను మళ్లిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కూడా నిఘా పెట్టామన్నారు.