తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు రామలింగయ్య కాలనీ జగనన్న లేఔట్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదివారం కాలనీ వాసులు టీడీపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రావణి రెడ్డి 3 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎటువంటి వసతులు లేకుండా కాలనీ ఏర్పాటు చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.