Download Now Banner

This browser does not support the video element.

కొండపి: మర్రిపూడి మండలం రేఖలగడ్డ గ్రామంలో జరిగిన హత్య ఆపై ఆత్మహత్య ఘటనపై డాగ్ స్క్వాడ్ తో దర్యాప్తు చేసిన పోలీసులు

Kondapi, Prakasam | Sep 13, 2025
ప్రకాశం జిల్లా మరిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నరసింహ అనే వ్యక్తి అనుమానంతో తన భార్యను రోకలిబండతో దాడి చేసి చంపడంతో పాటు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. విషమంగా ఉన్న నరసింహను పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ సోమశేఖర్ జరిగిన ఘటనపై పలు అనుమానాలు ఉండడంతో వెంటనే డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. డాగ్ అక్కడక్కడే తిరగడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us