ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జలపాతం ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో స్విమ్మింగ్ పూల్లోకి అటవీ శాఖ అధికారులు అనుమతి కల్పించారు. దీంతో ఈతలు కొడుతూ, సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు ఉదయం నుంచి సందడి చేస్తున్నారు. పర్యాటకులు అటవీ శాఖ నిబంధనలు పాటించాలని, లోతులోకి వెళ్లకూడదని స్థానిక రేంజర్ చంద్రమౌళి కోరారు.