నరసరావుపేటలో వైసీపీ నాయకుడు కాసు మహేశ్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో గోపిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు మాట్లాడితేనె కేసులు పెడుతూ పోవడం సరికాదని, ఈ సంప్రదాయం భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించారు. నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వేధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.