రంగారెడ్డి జిల్లా రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట గురువారం ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు సునీత లొంగిపోగా ఆమె తండ్రి విప్లవ రచయితలు సంఘం నాయకుడిగా పని చేసినట్లు పోలీసులు తెలిపారు. 1986లో పీపుల్స్ ఆర్ పార్టీలో చేరిన సునీత 1992లో నల్లమల్ల అడవుల్లోకి వెళ్లిందని అన్నారు. వీరిద్దరూ ఎన్నో ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని సిపి సుధీర్ బాబు తెలిపారు