అల్లూరి జిల్లా జికే వీధి మండలం దారకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ పరిసర ప్రాంతాల గిరిజనులు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దారకొండ వారపు సంతలో భారీ ర్యాలీ నిర్వహించారు. దారకొండ మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 20 గిరిజన గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ ధారకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని తద్వారా తమ అభివృద్ధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు.