Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం లో వైసిపి నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారు: వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి

Giddalur, Prakasam | Aug 28, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల దొడ్డం పల్లె గ్రామంలో జరిగిన ఓ ఇరువర్గల దాడి ఘటనను ఆపేందుకు వెళ్లిన పెద్దమనిషిపై కేసు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బొర్రా కృష్ణారెడ్డి అనే వైసిపి నాయకుడు గొడవను ఆపేందుకు వెళ్తే అతనిపై ఏ 2 కేసు పెట్టడం పోలీసులపై నాగార్జున రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో వైసిపి కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్నారని ఇది మంత్రులు అధిష్టానం ఎస్పీ తదితరులు గమనించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us