సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు ఫోన్ లో ఆదేశించారు.