ములుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు భిక్షాటన కార్యక్రమం కార్యక్రమం నేడు సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ కార్మికుడు మైదం మహేష్ జీతాలు రాక ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించగా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోలేదని, అందుకు నిరసనగా ఈ బిక్షాటన కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.