Download Now Banner

This browser does not support the video element.

అన్నమయ్య జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి:మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర విచారం

Rayachoti, Annamayya | Aug 22, 2025
అన్నమయ్య జిల్లాలో జరిగిన విషాద ఘటనపై రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రాజంపేట మండలం బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, వారిలో ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్న మంత్రి, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలు, నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు, యువత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us