యూరియా కష్టాలు నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఉదయం 5 గంటల నుంచే ఎరువుల కోసం బారులు తీరారు. ప్రస్తుతం పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి, యూరియా కొరత లేకుండా చూడాలని వారు కోరారు.