మార్వాడీల దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. శనివారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశమైన జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.