Download Now Banner

This browser does not support the video element.

కోటిపల్లి లంక లో వరద ముంపు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రైతులు

Ramachandrapuram, Konaseema | Aug 21, 2025
గోదావరి నది వరద ఉధృతి కొనసాగుతుండటంతో కె.గంగవరం మండలం, కోటిపల్లి వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీంతో కోటిపల్లి లంక ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. వరద తీవ్రత దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఐదు గంటల సమయంలో పాడి రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో పశువులు ఇబ్బందులు పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us