ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆటో బోల్తా పడింది. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రగడవరం మలుపులో వైన్ షాపు సమీపంలో ఆటో తుప్పల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు ఆటో డ్రైవర్ ను బయటకు తీసి సపర్యలు చేశారు.