నందిగామలో గణేష్ నిమజ్జన వివాదం..మళ్లీ ఉద్రిక్తత పెడన మండలం నందిగామ గ్రామంలో ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన కిరోసిన్ దాడి ఘటనకు సంబంధించి శనివారం రాత్రి 7 గంటల సమయంలో మరొసారి ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్య పరిష్కారానికి జరుగుతున్న చర్చలు ఒక్కసారిగా ఘర్షణగా మారడంతో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.