గతంలో పరిపాలించిన బీఆర్ఎస్, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.సాత్నాల మండలంలోని మాంగోర్ల, దేవిజిగూడ కు సంబంధించిన కాంగ్రెస్, BRS పార్టీ నాయకులు గురువారం ఆదిలాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో బిజెపిలో చేరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ వల్ల నేడు గ్రామాలలో సమస్యలతోసతమతమవుతున్నాయన్నారు.గ్రామపంచాయతీలకు నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ.. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏవి వచ్చిన బీజేపీ గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు