సెప్టెంబర్ 11వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో 08 రూపాయలుగా నిర్ణయించబడిందని సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో 07 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు అమ్మితే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ను (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.