భారీ వర్షాల కారణంగా సోన్ మండలం మాదాపూర్ గ్రామ స్వర్ణ వాగు ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులు, 15 పశువులను గురువారం నిర్మల్ జిల్లా పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. డయల్-100 ద్వారా సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాలతో సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపీ, NDRF బృందం సత్వర చర్యలతో వారిని సురక్షితంగా తరలించారు.