ఎన్నో రోజులుగా వాహనదారులు ఎదురుచూస్తున్న గార్ల- డోర్నకల్ రైల్వే గేటు ఈరోజు అధికారులు ప్రారంభించారు. మూడవ లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా గేటు మూసి ఉండడంతో,గార్ల -డోర్నకల్ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు,కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి గ్రామాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది, దీంతో డోర్నకల్ -గార్ల పట్టణవాసులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా,స్పందించిన అధికారులు ఈరోజు రైల్వే గేటును పున ప్రారంభించారు,దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.