ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామ పరిధిలోని వినీద్రమ్మ చెరువు పనులను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్రాక్టర్ ట్రక్కులో నిలుచొని వెళ్లి పనులను పరిశీలించారు. కార్లు వెళ్లేందుకు మార్గం సరిగా లేకపోవడంతో ఆయన ట్రాక్టర్పై వెళ్లారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ ఇతర జిల్లా అధికారులు కూడా ఆయనతో పాటు ట్రాక్టర్పై ప్రయాణించారు.