కార్వాన్ డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంలో అధికారులతో కలిసి కార్పొరేటర్ స్వామి యాదవ్ సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని మండపాలకు అధికారులు సిబ్బంది పర్యవేక్షించాలని తెలిపారు. సమస్య ఆత్మక ప్రాంతాలలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని కార్పొరేటర్ కోరారు.