కళ్యాణదుర్గంలో శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ, చిరంజీవి యువత నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాఘవేంద్ర గుప్తా, రూహుల్లా , లక్ష్మణ్ తదితరులు మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి నిండా నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.