Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కడప : నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా.. 8 మందికి గాయాలు

India | Aug 31, 2025
కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం తెలిసిన వివరాల మేరకు చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో లంభోదరునికి ఐదవ రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవం నిర్వహించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడిందన్నారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us