వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని చిర్లపల్లి గేటు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక నుండి హైదరాబాద్ వెళ్తున్న ఓ కారు, కోడంగల్ నుండి రావల్ పల్లి వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.