సి బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామానికి చెందిన ఇద్దరు ఉల్లి రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాము పంటకు పెట్టిన పెట్టుబడి, ప్రస్తుతం అందుతున్న ధరతో ఎంత మాత్రం గిట్టుబాటు కాదని అందుకే పురుగుమందు తాగుతున్నట్లు ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకోవడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.