Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: పంగడి మదర ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తీవ్ర జ్వరంతో మృతి:DTDO రమాదేవి

Asifabad, Komaram Bheem Asifabad | Aug 26, 2025
తిర్యాణి మండలం పంగడి మదర ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అనురాగ్ అనే విద్యార్థి సోమవారం రాత్రి MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు DTDO రమాదేవి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ....ఈ నెల 15న జ్వరం వస్తుందనీ వారి తల్లిదండ్రులు తిర్యాణి ఆసుపత్రికి తరలించారు. తిర్యాణి ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స అందించిన నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు చేశారు. అనురాగ్ కు డెంగ్యూ నిర్ధారణ కావడంతో వెంటనే వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు DTDO రమాదేవి తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us